మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 6, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఎల్లలు దాటి పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలలో పంట పొలాలన్నీ నీటమునిగాయి. గ్రామాలలోని లోతట్టు ప్రాంతలన్ని జలమయమయ్యాయి. కొందరు ఇళ్లలోకి నీళ్లు చేరి నానా అవస్థలు పడుతున్నారు. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని ప్రాంతాలలో వరద ఉద్ధృతికి తారు రోడ్లు సైతం కోతకు గురై గండ్లు పడ్డాయి. పాఠశాలలు ప్రారంభం కావడంతో మండల కేంద్రం నుండి లోపల గ్రామాల పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు, చదువుకునేందుకు మండల కేంద్రానికి వచ్చిన విద్యార్థులు, రాకపోకలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Post A Comment: