మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామంలోని ఓర్సు రామాస్వామి,బోలే స్వామి, రాచకొండ సుజాత ఇళ్ళలో కి వరుణుడి భీభత్సనీకి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వచ్చిన వరద నీరు వారి ఇళ్లలో వచ్చి చేరింది. గ్రామంలో వీధి రోడ్లకు సరైన సైడు కాలువలు లేకపోవడం వలన వరద ప్రవాహం వారి ఇళ్లకు వచ్చేసిందని, నిత్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సైడ్ కాలవలు ద్వారా వర్షపు వరద ప్రవాహాన్ని, గ్రామం నుంచి బయటకు పంపే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Post A Comment: