చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ యువజన నాయకుడు భూక్య శ్యాం (45)అంతిమయాత్రలో బుధవారం ప్రముఖులు పాల్గొని నివాళులు అర్పించారు. మంగయ్య బంజర గ్రామంలో మృతుని స్వగృహం నుండి ప్రారంభమై అంతిమయాత్ర స్మశానవాటిక వరకు కొనసాగింది. శ్యామ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మాలోతు బొజ్య నాయక్ స్వయానా బామ్మర్ది కావడంతో ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, దుర్గా రాజేశ్వరరావు, సారేపల్లి శేఖర్, భానోత్ రాముడు, భానోత్ పార్వతి, రాఘవులు, దా రా బాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: