జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ....
చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరు శాతం రోజురోజుకీ పెరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు . స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలందరూ కోవిండు నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని.. అనవసర భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను నిర్భయంగా పాఠశాలకు పంపవచ్చు అన్నారు కేజీబీవీ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోవచ్చు, వసతి గృహాలు ప్రారంభించిన వెంటనే తిరిగి కేజీబీవీ లో తిరిగి వెళ్ళవచ్చు అన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల బిల్లులు రెండు మూడు రోజుల్లో వస్తాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వంట షెడ్డు, పహరి గోడ కు, మూత్రశాల కు సైతం నిధులు మంజూరు అయినాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ, హెచ్ఎం గంగా ప్రసాదు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: