మన్యం టీవీ మంగపేట.
బుధవారం కమలాపురం ఎస్సి వాడలో కమలాపురం తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడు ఈదునూరి రవీందర్,ప్రధాన కార్యదర్శి వీరగాని బాలక్రిష్ణ ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి గులాబీ కుటుంబ సభ్యులు, దళిత వాడలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్యన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బంధు పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఆర్థికంగా వెనుకబడిన దళితులను యజమానులను చేయడమే దీని లక్ష్యం.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దళితులు అభివృద్ధి లోకి రావడానికి దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారు.
విపక్షాల వారు పార్టీ పై, దళితబందు పథకం పై, కెసిఆర్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు ఎప్పటికైనా దళితులను అభివృద్ధి లోకి తీసుకువచ్చేది తెరాస పార్టీ, కెసిఆర్ ప్రవేశ పెట్టిన దళిత బంధు పధకం మాత్రమేనని వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో.
జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పచ్చ శేషగిరిరావు,టి ఎస్ ఎస్ జిల్లా కార్యదర్శి కోడం సత్యనారాయణ ,మండల అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్ సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు, మండల ఉపాధ్యక్షుడు నాగపూరి రాజేంద్రప్రసాద్,మండల కార్యదర్శి గుడిసేవ నాగేశ్వరరావు మండల యూత్ కమిటీ ఉపాధ్యక్షుడు యాసం హరీష్,పార్టీ సీనియర్ నాయకులు బానోత్ వసూరామ్ నాయక్ ,గ్రామకమిటి ఉపాధ్యక్షులు తుక్కాని శ్రీను, కదురు మల్లేష్ కాసర్ల చంద్రం,యం పురుషోత్తం,సహాయ కార్యదర్శులు అనీల్ రెడ్డి,ఆకుల ప్రభాకర్ ,ఎస్సి సెల్ అధ్యక్షుడు గాజర్ల శ్రీను , ఉపాధ్యక్షుడు గాజర్ల రాము,గ్రామ మహిళా నాయకురాలు గోస్కుల లక్ష్మీ,పార్టీ కార్యకర్తలు ముత్తయ్య, చంద్రయ్య, కదురు నర్సయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: