CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ర్యాలీ - పలు సమస్యలపై తహసిల్దార్ కు వినతిపత్రం అందించిన కాంగ్రెస్ నాయకులు

Share it:

 



 మన్యంటీవి, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట పట్టణంలో మల్కారం రోడ్డు సెంటర్  నుంచి తాహసిల్ధార్ ఆఫీస్ వరకు దమ్మపేట మండల కాంగ్రేస్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సత్యప్రసాద్ అధ్యక్షతన, దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోర నిర్వహించడం జరిగింది. అశ్వారావుపేట నియోజక వర్గం కోఆర్డినేటర్ శ్రీ మాసన్నపల్లి లింగోజి, సున్నం నాగమణి జడ్పీటీసీ ములకలపల్లి, టిపిసిసి మెంబర్ ల అద్వర్యం లో బారి గా ర్యాలీ చేసి, మండల తాహసిల్ధార్ శ్రీ రంగా ప్రసాద్ కి 119 నియోజక వర్గాల్లో దళితబంధు అమలుచేయాలని గిరిజనులకు పొడుభూములు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎస్సి, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయాలని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులు కొనకళ్ల వెంకటరెడ్డి జడ్పీటీసీ చండ్రుగొండ, ఏలూరు కోటేశ్వరరావు జిల్లా కిసాన్ సెల్ ప్రెసిడెంట్, తోట దేవి ప్రసన్న జిల్లా మహిళ కమిటీ అధ్యక్షురాలు, వాలి కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్, పొదిలి జ్యోతి జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాలు, యెస్ కె సుకుర్ మండల కిసాన్ సెల్ ప్రెసిడెంట్, సికటి శ్రీనివాసు రావు జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి, చిన్నంశెట్టి చిట్టిబాబు, ఎండి జానీ, కందుల వెంకటేశ్వరరావు, చిలక శ్రీను, కబీర్, కొమరం ప్రసాద్, డొక్కా ప్రకాష్, డొక్కా గోపి, డొక్కా సులోచన మరియు పానుగంటి రాంబాబు, మండల మహిళ నాయకులు తదిదరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: