మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణ ఎంపీటీసీ -1 వేముల భారతి మొదటి సెగ్మెంట్ లోని పాఠశాలల పునాప్రారంభంలో భాగంగా స్థానిక దొంతికుంట వడ్డెర బజారు, శ్రీ గౌతమి పబ్లిక్ స్కూల్స్ ను సందర్శించారు, తరగతి గదిలో విద్యార్థుల భౌతిక దూరం శానిటేషన్ సదుపాయలను పరిశీలించి విద్యార్థిని విద్యార్థులకు కరోనా పై అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరియు ఉపాధ్యాయులను స్కూల్ వసతుల పట్ల వివరాలు అడిగితెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమం లో ఆమెతో పాటు ఆయా పాఠశాలలోని ఉపాధ్యా బృందం పాల్గొన్నారు.
Post A Comment: