👉యువజన అధ్యక్షులు హర్ష నాయుడు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా శుక్రవారం మణుగూరు మండలం లోని తోగ్గుడెం, గుట్టమల్లారం లో టిఆర్ఎస్ పార్టీ యువజన గ్రామ కమిటీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. తోగ్గుడెం టిఆర్ఎస్ యువజన అధ్యక్షులు గా అడబాల.మోహిత్ సాయి ని,గుట్టమల్లారం టిఆర్ఎస్ గ్రామ యువజన అధ్యక్షులు గా కొమరం.రామకృష్ణ ని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండల అధ్యక్షులు ముత్యం బాబు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,హాజరయ్యారు.ఈ కార్యక్రమం లో తోగ్గుడెం సర్పంచ్ బొగ్గం. రజిత,గుట్టమల్లారం సర్పంచ్ కారం.ముత్తయ్య, ఎంపీటీసీ కణితి.బాబురావు, టిఆర్ఎస్ యువజన మండల అధ్యక్షులు హర్ష నాయుడు,మండల నాయకులు మాదాడి. రాజేష్,మహేష్,రఘు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: