👉ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వర రావు, సెక్రటరీ దండా రాధాకృష్ణ
మన్యం టీవి, మణుగూరు:
కరోనా ప్రభావం వలన గత సంవత్సరం లాకుడౌన్, ఆ తరువాత సెకండ్ వేవ్, ఆ తరువాత వ్యాపార పరిస్థితులలో తీవ్ర వడిదుకులు ఉన్న నేపథ్యం లో ఇంటి యజమానులు అద్దెలు పెంచటం వలన వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి దృష్టికి వచ్చినందువలన, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు సమావేశం ఏర్పాటు చేసి వారి అబిప్రాయం తెలుసుకొని కిరాయిదారులకి ఇబ్బందులు కలగకుండా ఇప్పట్నుండి ఒక సంవత్సరం పాటు అద్దెలు పెంచకుండా గతంలో ఉన్న అద్దెలు కొనసాగించాలన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దోసపాటి వెంకటేశ్వర రావు, సెక్రటరీ దండా రాధాకృష్ణ ఆద్వ్యరం లో తీర్మానం చేయటం జరిగింది.
Post A Comment: