CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కెసిఆర్ మహోత్తమ పథకాలను ప్రజలకు వివరిస్తూ-

Share it:

 


టీఆర్ఎస్ జెండా పండుగను వేడుకలా జరపండి - ఎం.ఎల్.ఏ వనమా వెంకటేశ్వరరావు


మన్యం టీవీ పాల్వంచ:-

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు* రాష్ట్రంలో చేపడుతున్న మహోత్తమ పథకాలను ప్రజలకు వివరిస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు *కల్వకుంట్ల తారక రామారావు* పిలుపు మేరకు చేపడుతున్న జెండా పండుగను వేడుకలు జరపాలని *కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు* అన్నారు. బుధవారం పాతపాల్వంచలోని *వనమా* స్వగృహంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా *వనమా* మాట్లాడుతూ *ముఖ్యమంత్రి కేసీఆర్* బడుగు, బలహీన పేద వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని, టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను పేదలకు వివరించాలని *కెసిఆర్, కెటిఆర్* ల పిలుపుమేరకు ఈనెల 2 వ తేదీ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో, రెండు మున్సిపాలిటీల్లో, గ్రామ గ్రామాల్లో, వార్డుల్లో గులాబీ జెండా ఎగురవేసి జెండా పండుగను వైభవంగా జరపాలని అన్నారు. ఈ నెల 2 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు గ్రామ వార్డు కమిటీలను 10 వ తేదీ నుండి 20 వ తేదీ వరకూ మండల, పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. పార్టీ కమిటీలను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వేయాలని *కెటిఆర్* సంకల్పించారన్నారు. పార్టీలకు కార్యకర్తలే పునాదులని టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో *టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు, డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి కన్వీనర్ కిలారు నాగేశ్వరావు, జెడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, ఎంపీపీ మడవి సరస్వతి, వైస్ ఎంపీపీ మార్గం గురువయ్య, సొసైటీ డైరెక్టర్ కనగాల నారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల శ్రీరామమూర్తి, పూసల విశ్వనాథం, టీఆర్ఎస్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, బేతంశెట్టి విజయ్,చింత నాగరాజు, కందుకూరి రాము, వీర్రాజు, రషీద్, ఆర్. కె, సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భూక్యా రవీందర్, హర్షవర్ధన్, పెండ్యాల కృష్ణమూర్తి, సందు ప్రభాకర్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు* పాల్గొన్నారు.

Share it:

Post A Comment: