కళా బృందం చేత ప్రదర్శన
గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో చేపట్టారు కళా బృందం చేత పాటలు పాడుతూ ప్రదర్శన చేశారు. ప్రజల్లో బలంగా నాటక పోవడం కోసం కళా బృందం చేత అవగాహన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం చేత ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గుండాల పంచాయతీలోని అన్ని గ్రామాల్లో కళా బృందం ప్రదర్శనలు ఇస్తున్నారు. సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ అలీ, సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, ఉప సర్పంచ్ ఉపేందర్, కళాకారులు నరకం టి వెంకటేశ్వర్లు, వారి బృందం పాల్గొన్నారు
Post A Comment: