డెంగ్యూ జ్వరంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బి టి పి ఎస్ కాంట్రాక్టు కార్మికుడు సందీప్ కుమార్ 20 years శనివారం భద్రాచలం ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తే స్వర్ భరద్వాజ్, సంజీవి దేవి దంపతులు గత ఐదు సంవత్సరాల నుండి బి టి పి ఎస్ లో కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తూ సాంబయ్య గూడెం గ్రామంలో నివాసముంటున్నారు. వీరి కుమారుడు సందీప్ గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు.
విషయం తెలుసుకున్న ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి సందీప్ మృతదేహాన్ని సందర్శించి సంతాపం ప్రకటించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ప్రైవేటు వైద్యం చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేకపోవడం తో ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి నిన్న సాయంత్రం తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించటంతో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించాడు. ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంత పేద ప్రజలు అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మణుగూరు వంద పడకల హాస్పటల్ లో పూర్తి స్థాయి వైద్యులను నియమించి, 24 గంటలు వైద్య సౌకర్యం కల్పించి, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు.
Post A Comment: