👉బందుకు పాక్షిక స్పందన
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల హాస్పటల్ లోని పూర్తి స్థాయి లో వైద్యులని నియమించాలని అఖిల పక్షల ఆధ్వర్యంలో బందు నిర్వహించారు . ఈ బంద్ కి స్పందన లభించింది . ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు బొల్లుజు అయోధ్య మాట్లాడుతూ వంద పడకల ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగు పరచాలి అన్నారు. జిల్లా కాలెక్టర్ మరియు ఐటీడీఏ, పిఓ స్పందించి పినపాక ప్రజలకు వైద్య సదుపాయం అందేలా చూడాలి అన్నారు. అలాగే మరల ఈ నెల 6న నియోజక వర్గ నిర్భందన చెయ్యడం జరుగుతుంది అని,అఖిల పక్షల ఆధ్వర్యం లో ఉద్యమాన్ని మరింత ఉదృతం చెయ్యడం జరుగుతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో పుల్లా రెడ్డి,టీడీపీ చలపతి రావు,కాంగ్రస్ నాయకులునవీన్ పట్నాయక్,వీరం.సుధాకర్ రెడ్డి,పేదిన సీపీఎం ఉప్పతల.నరసింహారావు,వెంకన్నా,నెల్లూరు.నాగేశ్వరావు,బీజేపి లింగంపల్లి.రమేష్, సీపీఐఎంఎల్ మధుసూదన్ రెడ్డి,మరియు అక్కి. నరసింహారావు,ఎస్కె.సర్వర్,సుధాకర్,తోట.రమేష్,మంగి.వీరయ్య,కే.వి.నారాయణ, దశరదం,నువ్వుల.రవి,సాయి,అశోక్,ప్రశాంత్,అన్నమయ్య మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Post A Comment: