మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈ నెల 10వ తారీకున వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకునే మండపాలకు విద్యుత్ సరఫరా కోసం ఆయా మండపాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యుత్ శాఖ ద్వారా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మండల విద్యుత్ శాఖ అధికారి రఘురామయ్య తెలిపారు. ఒక కిలోవాట్ నుండి 1.5 కిలోవాట్ వరకు 2100 రూపాయలు, 1.5 కిలోవాట్ నుండి 2 కిలో వాట్ వరకు 2800 రూపాయలు, ఇంతకు మించి అదనంగా విద్యుత్ సరఫరా అవసరం కోసం ప్రతి కిలోవాట్ కు 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే మండపాల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ ద్వారా నిబంధనల ప్రకారం పొందిన రసీదును పోలీస్ శాఖ వారికి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినాయక మండపాలకు విద్యుత్ సరఫరా కోసం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్న విషయాన్ని అందరూ గమనించాలని కోరారు. మండల వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు పైన తెలిపిన విధంగా అనుమతులు పొంది విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.
Post A Comment: