భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) సోమవారం నాడు ఉదయం సుమారు 7 గంటల సమయంలో చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని లెనిన్ కాలనీ వద్ద కాలకృత్యాలకై వెళుతున్న ఆలెం భ్రమ్మనాయుడు(30) అనే యువకుడు మావోయిస్టుల అమర్చిన మందుపాతర పేలి గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మావోయిస్టులు అమర్చిన మందుపాతరల వలన గతంలో కూడా చాలామంది అమాయకపు ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది.కొంతమంది తమ అవయవాలను పోగొట్టుకుని విగత జీవులుగా జీవిస్తున్నారు. మావోయిస్టుల చర్యలపై మరియు కదలికలపై పోలీసువారికి పూర్తి సమాచారం కలదు.పోలీసులపై అసహనానికి గురి అవుతున్న మావోయిస్టులు మందుపాతరలను,బూబీ ట్రాప్స్ లను తయారుచేసి సామాన్య ప్రజలు నివసించే ప్రదేశాలలో వాటిని అమర్చడం ద్వారా ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలను మరియు తమ జంతువుల ప్రాణాలను కోల్పోతున్నారు.మావోయిస్టులు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతూ,గిరిజన ప్రజల వద్ద నిత్యావసరాలను దోపిడీ చేస్తూ,మిలీషియా చేత వారిపై దాడులు చేయిస్తున్నారు.ఇలాంటి నేరాలలో మావోయిస్టులకు సహాయం చేసే వ్యక్తులపై మరియు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు.
Post A Comment: