CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యవసాయరంగానికి ప్రతీక బలరాముని జయంతి.

Share it:

 



 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

మన్యం టీవీ మంగపేట.

వ్యవసాయ రంగానికి బలరామ జయంతి ఒక ప్రతీక అనీ జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు ఆదివారం వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయంలో బలరాముని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా బలరామ జయంతినీ వ్యవసాయ పండుగగా భారతీయ కిసాన్ సంగ్ మరియు స్వచ్ఛంద సంస్థలు వివిధ రైతు కమిటీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బలరామ జయంతిని రైతు పండుగగా జరుపుకోవడం హర్షణీయమన్నారు శతాబ్దాల క్రితమే ఆహారానికి ఉన్న అవసరాన్ని గుర్తించిన బలరాముడు నాగలిని భుజానికెత్తుకుని వ్యవసాయ రంగం ప్రాధాన్యతను చాటి చెప్పారన్నారు నేటి ప్రభుత్వాలు సైతం వ్యవసాయ రంగం ప్రాధాన్యతను గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సాంబశివ రెడ్డి అన్నారు. ఉత్తర భారతదేశంలో బలరామ జయంతి ని ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు బలరామ జయంతి సందర్భంగా స్థానిక రైతులకు సబ్సిడీపై ఫెర్టిలైజర్ మినీ కిట్లను ఆయన పంపిణీ చేశారు గోమాతకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆహారాన్ని అందించారు వ్యవసాయ రంగానికి చిహ్నం ఐన నాగలికి పూజలు నిర్వహించారు. అనంతరం రాజకీయాలకతీతంగా రైతు జెండా పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస్ ఆగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి చెట్టుపల్లి తిరుపతిరావు స్థానిక రైతులు దూలగొండ నారాయణ ధూళిపాల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: