మన్యం టీవి, అశ్వరావుపేట: కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం పరిధిలో అశ్వరావుపేట మండలం అల్లి గూడెంను దత్తత గ్రామంగా గతంలో స్థానిక హెచ్ఆర్సీ ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డాక్టర్ అమీద్ అన్సారీ బేగం తీసుకున్నారు. దత్తత యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ పరిధిలో గల రైతులకు ఉద్యాన, వ్యవసాయ పంటలు, నేల, నీటి సంరక్షణ, పాడి సంపద, మత్స్య, పౌల్ట్రీ, పట్టు పరిశ్రమ తోపాటు మార్కెటింగ్, విద్య, వైద్యం గురించి సాంకేతిక సలహాలు సహాయం. అందులో భాగంగానే ఈ రోజు అల్లి గూడెం గ్రామ రైతులకు సర్పంచ్ మొడియం కృష్ణవేణి ఆధ్వర్యంలో హెచ్ఆర్సీ ప్రిన్సిపాల్, శాస్త్రవేత్త డాక్టర్ అమీద్ అన్సారీ బేగం ఉచితంగా కూరగాయల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ జి విజయ్ కృష్ణ, సీనియర్ అసిస్టెంట్ కే సుబ్బారావు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: