CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేట లో కల్యాణ లక్ష్మి మరియు విపత్తు నష్టపరిహార చెక్కులు పంపిణీ

Share it:

 



 *మన్యం టీవి, అశ్వరావుపేట:* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల పరిధిలోని ఏప్రిల్, మేనెలలో తుఫాను కారణంగా ఇల్లు కోల్పోయిన బాధితులకు మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, తెరాస మండల అధ్యక్షుడు బండి పుల్లారావు తదితరులు తహసిల్దార్ చల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. మండలం పరిధిలోని ఆరు కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు ఏప్రిల్ మరియు మే నెలలో తుఫాను కారణంగా సంభవించిన విపత్తు బాధితులకు ప్రభుత్వం తరఫున వచ్చిన రెండు లక్షల యాభై ఆరు వేలు రూపాయల ఆర్థిక సహాయం చెక్కులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు భూక్య ప్రసాద్, సిపిఐ నాయకులు రామకృష్ణ, రఫీ, సిపిఐ ఎంఎల్ నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, ఎంపీటీసీలు వేముల భారతి, గోపిన లక్ష్మి కాంత, సర్పంచులు నార్లపాటి సుమతి, పోడియం సత్యవతి, మండల వ్యాప్తంగా వున్నా లబ్ధిదారులు మరియు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: