పార్టీ బలోపేతానికి కార్యకర్తలు నడుం బిగించాలి
జెండా పండుగ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు వీరస్వామి
గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) కార్యకర్తలకు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుందని గుండాల మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు నాయకత్వాన మండలంలో పార్టీ పటిష్టంగా మారుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఒక టిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమవుతుందన్నారు. మండల కేంద్రంతో పాటు లింగగూడెం, ముత పురం, శంభుని గూడెం, కాచన పల్లి, దామరమతొగు, తదితర గ్రామాల్లో జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, సుధాకర్, ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: