మన్యంటీవి, అశ్వారావుపేట: ప్రజాకవి కాళోజి నారాయణ రావు 107 వ జయంతి సందర్భంగా అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి నివాళిలు అర్పించారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజి చిరస్మరణీయులని ఎంపీపీ జల్లి పల్లి శ్రీ రామూర్తి అన్నారు. ప్రజల్లో చైతన్య దీప్తి వెలిగించడానికి ఆయన ధైర్యంగా నిలబడే వారని అన్నారు. అశ్వారావుపేట ఎంపీడీఓ కార్యాలయం ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, ఎంపీడీఓ విద్యాదరావు ఈఓఆర్డి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: