భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) వినాయక చవితి పురస్కరించుకొని ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను గురువారం నాడు ఉచితంగా పంపిణీ చేశారు. లక్ష్మీదేవిపల్లి బావర్చి ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమానికి సంజయ్ నగర్ సర్పంచ్ భూక్య పద్మ , ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, ఐక్య తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు బాలునాయక్ హజరై ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని, మండపాల వద్ద ప్రభుత్వం సూచించిన కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంజయ్ నగర్ సర్పంచ్ పద్మ, ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్, వార్డ్ సభ్యులు సుధాకర్, మధుసూదన్ రావు, వజ్జా చందు, తుంపిరి ప్రసాద్, ఐక్య తల్లిదండ్రుల సంఘం అధ్యక్షులు బాలునాయక్, బావర్చి రెస్టారెంట్ అధినేత చక్ర కళధర్, నాగరాజు ఉపాధ్యాయులు కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: