మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండల పరిదిలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయితీ కార్యదర్శి గంజి విద్యసాగర్ రావు పంచాయితీ పరిధిలోగల పల్లె పకృతి వనంలో కలుపు మొక్కలు తీసే పనిలో ఆదివారం దర్శనమిచ్చారు. కన్నాయిగూడెం గ్రామపంచాయతీ లో ముగ్గురు పంచాయతీ కార్మికులు ఉన్నప్పటికీ ఎవరు రాకపోవడంతో చేసేదిలేక తానే స్వయంగా పల్లె పకృతి వనంలో బూస్ కటింగ్ యంత్రం సహాయంతో కలుపుమొక్కలను తొలగించారు. పంచాయతీ లో ముగ్గురు కార్మికులు ఉన్నారని వారు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని ఈ నేపథ్యంలో చేసేదిలేక తానే స్వయంగా ఈ పని చేసుకోవలసి వస్తుందని కార్యదర్శి అన్నారు. మల్టీపర్పస్ కార్మికులు మాట వినడం లేదని, కానీ ఉన్నతాధికారులకు అవేమీ కనిపించవని దీంతో పల్లె పకృతి వనంలో మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. అయితే కార్యదర్శి బాధ్యతగా కలుపు మొక్కలు నివారణ చర్యలు తీసుకోవడంపై పంచాయతీ ప్రజలు పలువురు అభినందిస్తున్నారు.
Post A Comment: