*సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
తాడ్వాయి మండలం లో జర్నలిస్ట్ లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం అని ఇచ్చిన హామీ విషయం లో ప్రభుత్వం ఘోరం గా విఫలం అయింది అని,సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ అన్నారు. సోమవారం నాడు జర్నలిస్ట్ దినోత్సవము సందర్బంగా మేడారం హరిత హోటల్ లో చేర్ప రవీందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం లాంటి జర్నలిస్ట్ లు ఎలాంటి ప్రతిఫలం ఆచించకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వంకు తెలిసే విధంగా,ప్రభుత్వం పథకాలు ప్రజలకు తెలిసే విదంగా అను నిత్యం పని చేస్తున్న జర్నలిస్ట్ లకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాము అని కెసిఆర్ ఉద్యమ సమయం లో పదే పదే చెప్పి, ఎలక్షన్ మేనిఫెస్టో లో పెట్టి మరియు మంత్రి దయాకర్ రావు జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల సమయం లో హామీ ఇచ్చి ఇప్పుడు కనిపించడం లేదని ఇప్పుడు కొంతమంది నాయకులం అనే చెప్పుకొని మేడారం జాతర వస్తుంది. కమిషన్ ల కోసం అని వాట్సాప్ లలో కనిపిస్తున్నారు. అని అన్నారు.మేడారం జాతర సమీక్షా కోసం మాత్రం వీళ్లకు సమయం లేదని అన్నారు.ఇప్పటికి అయినా జర్నలిస్ట్ లకు ఇచ్చిన హామీలు నెరవేర్చి జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు చేయాలి అని కోరారు.
Post A Comment: