ఒకరి పరిస్థితి విషమం ఖమ్మం తరలింపు
గుండాల సెప్టెంబర్ 8 (మన్యం టీవీ) చిన్నపాటి ఘర్షణ చిలికి చిలికి ముదరటం తో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు గోడ్డలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మండలం పరిధిలోని నర్సాపురం తండాకు చెందిన బి రామ్ సింగ్, తన కొడుకు మంగీలాల్, నీలమ్మ , తన కొడుకు ప్రవీణ్ ల ఇల్లులు దగ్గర దగ్గరగా ఉండడంతో వీరి మధ్య అప్పుడప్పుడు గొడవలు వచ్చిపోతూ ఉండేవి బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో గొడవ ఎక్కువ కావడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రామ్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గుండాల ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి కొంచెం విషమించడంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు
Post A Comment: