మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం కమలాపురం పాత ఊరు లోని గణేష్ ఉత్సవ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమలాపురం మాజీ సర్పంచ్ కటికనెని మోహన్ రావు కుమారుడు కటికనేని ప్రఫుల్ రావు,నర్రా సాంబయ్య,రైస్ మిల్ రాంబాబు అన్నదానం కావాల్సిన సహాయం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఏటూరునాగారం సి.ఐ కిరణ్ కుమార్,ఏటూరునాగారం ఎస్.ఐ శ్రీకాంత్ రెడ్డి, మంగపేట ఎస్.ఐ తాహిర్ బాబా హాజరై పలువురికి అన్నదానం చేసి, ఉత్సవ కమిటీ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పచ్చ శేషగిరిరావు,సిద్దంశెట్టి లక్ష్మణ్ రావు,మోడ్రన్ శ్రీనివాస్ ,రాణా ప్రతాప్ రెడ్డి,సిద్దంశెట్టి శ్రీనివాస రావు,గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Post A Comment: