ఆళ్లపల్లి మండల పర్యటనలో కలెక్టర్ అనుదీప్ కు లక్ష్మీపురం గ్రామస్తుల వినతి
గుండాల/ ఆళ్లపల్లి సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండలం పరిధిలోని లక్ష్మీ పురం గ్రామ సమీపంలో గల చెరువులు, అలుగు లకు వాటర్ షెడ్ స్కీమ్ నుండి నిధులు మంజూరయ్యాయని వాటి పనులను పూర్తి చేయకుండానే అధికారుల అండదండలతో నిధులను స్వాహా చేసిన గుత్తేదారు పై చర్యలు తీసుకోవాలని లక్ష్మీపురం గ్రామస్తులు మంగళవారం మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందించారు. గుత్తేదారు పనులు చేపట్టకుండానే నిధులు స్వాహా చేశాడని వారు ఆరోపించారు. వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం లో కలెక్టర్ అనుదీప్ కు విజ్ఞప్తి చేశారు
Post A Comment: