హైదరాబాద్:-పంచాయతీరాజ్, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది.
30 శాతం మేర గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల నుంచి 13 వేలకు పెరిగింది.
అలాగే ఎంపీటీసీ , సర్పంచుల గౌరవ వేతనం 5 వేల నుంచి 6500కు పెంచుతూ పంచాతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Post A Comment: