గుండాల సెప్టెంబర్ 28 (మన్యం మనుగడ) పొంచిఉన్న పెను ప్రమాదం. మండల కేంద్రం నుండి సాయన్న పల్లి వెళ్లే మార్గ మధ్యలో గల మల్లన్న వాగు పై నిర్మించిన వంతెన కు ఇరువైపులా నిర్మించిన కాంక్రీట్ వాల్ కూలిపోవడంతో వంతెన క్రింద వరకు కోతకు గురైంది. అధికారులు దానిని మరమ్మతులు చేయకపోవడంతో ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నదని నిత్యం రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు
Post A Comment: