మన్యం మనుగడ, పినపాక :
సెప్టెంబర్ పదవ తారీఖున హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి చైత్ర ను పైశాచికంగా చంపి వేసిన సంఘటన అందరికీ తెలిసిందే. చైత్రను చంపిన దుర్మార్గుడి కి ప్రభుత్వం వెంటనే మరణశిక్ష విధించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ లో చిన్నారి చైత్ర ఆత్మశాంతి కోసం నినాదాలు చేస్తూ దోషి కి శిక్ష వేయాలని మానవహారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు, జానపద కళాకారుడు సిద్దెల హుస్సేన్ పాల్గొనడం జరిగింది
Post A Comment: