CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంజనీర్లను సన్మానించి న ఎంపీపీ

Share it:

 



 మన్యంటీవి, అశ్వరావుపేట:ఈ రోజు ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప ఇంజినీర్ మోక్షగుండా విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా, ఇంజినీర్ల అందరకీ జాతీయ ఇంజియర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. అలాగే ఈ రోజు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ లలో విధులు నిర్వహించే పంచాయతీ రాజ్ డిఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాసరావు మరియు విజెఎస్, ఈసీ రామచంద్రరావులను అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రత్న గ్రహీత మోక్ష గుండా విశ్వేశ్వరయ్యా ఇంజినీరింగ్ లో అపారమైన సేవలు అందిచి దేశ ప్రగతికి ఎంతగానో దోహద పడ్డారు, వారీ జయంతినీ పురస్కరించుకొని మనం జాతీయ ఇంజినీర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం అని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీడివో విద్యాధర రావు, యూడీసీ శ్రీనివాస్, ఎపిఓ శ్రీనివాస్ రావు, సూపర్డెంట్ ప్రసాద్, టైప్ఇస్ట్ ప్రసాద్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది చారి, జాని తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: