మన్యం టివి;ములకలపల్లి మండలం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైన తాళ్లపాయా గ్రామ లోని ఆర్.అండ్.బి రోడ్డు నీ పరిశీలించిన అశ్వారావుపేట నియజకవర్గా శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు శాశ్వత పురస్కారం గా రోడ్డు నిర్మించాలని అధికారులను ఆదేశించారు, అనంతరం మూక మామిడి పంచాయతీ మోగరాల గుప్ప గ్రామానికి చెందిన పాయం జాన్ బాబు మరియు పూనేం దుర్గారావు,ఇటీవలే అడవిలో విద్యుత్ షాక్ కి గురై మరణించిన కారణంగా వారి ఇరువురి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు సమాచారం ఇవ్వగలరని తెలిపారు.మోగరాల్లగుప్ప లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ళకి నీటి సమస్య మరియు విద్యుత్ సమస్య ఉన్నదని తెలియపరచడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి అధికారులతో మాట్లాడి త్వరగా ఈ సమస్య నీ పరిష్కరించాలని అధికారుల నుఆదేశించారు,అనంతరం రామాంజనేయపురం,పూసుగూడెం గ్రామాల్లో పర్యటించి అక్కడి ఏర్పార్పాటు చేసిన వినాయకుడి రెండు మండపాలకు పదివేయిల రూపాయల చొప్పున,ఇరవై వేల రూపాయలు మాజి జెడ్పిటిసి బత్తుల అంజి ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మాజి జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి,టి ఆర్ ఎస్ ములకలపల్లి మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు,సర్పంచులు కారం సుధీర్,బైటి రాజేష్, మరియు అడపా నాగేశ్వరరావు,సురభి రాజేష్,వెలకం వెంకటేష్,గడ్డం నతానెల్,గాదిగోని వెంకటేష్ గౌడ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: