👉 గ్రామంలో ఊరేగింపు, పూజలు..
మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామంలో ఆంబోతు మృత దేహానికి గ్రామస్తులు సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆంబోతు బుధవారం మృతి చెందింది. కళ్ళముందు ప్రతిరోజు తిరుగుతుండే ఆంబోతు మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీళ్లు పెట్టారు. ఆంబోతును గ్రామాల్లో అనాదిగా దైవంగా పూజిస్తుంటారు. పండుగల సమయంలో ఆంబోతుకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇళ్ల వద్దకు వచ్చినపుడు ఆంబోతుకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తుంటారు. ఆంబోతు చనిపోవడంతో మృత దేహాన్ని ట్రాక్టరుపై ఉంచి గ్రామస్తులు ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సమీపంలో ఆంబోతు మృత దేహానికి సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: