CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీఎంఎస్ ఆధ్వర్యంలో చేపల వలలు పంపిణీ

Share it:

 



సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ బీఎంఎస్ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండలం ఇరవెండిలో 5 మత్స్యకార కుటుంబాలకు శనివారం చేపల వలలు పంపిణీ చేశారు. ఇటీవల ఇరవెండిలో శ్రీ సంతానవేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్న బీఎంఎస్ బాధ్యులు స్థానిక మత్స్యకారులకు వలలు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంట్లో భాగంగా వారికి రూ.30 వేల విలువైన చేపల వలలు పంపిణీ చేశారు. తమ సమస్యను వారికి వివరించి వలలు అందేలా కృషి చేసిన ఇరవెండి మాజీ ఎంపీటీసీ సభ్యుడు వల్లూరిపల్లి వంశీకృష్ణతో పాటు బీఎంఎస్ బాధ్యులకు జాలర్లు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఉపాధ్యక్షురాలు సునితామొహంతి గారు, తనూశ్రీ ఘోష్ రేఖాహరినారాయణన్, ప్రగ్యాశర్మ, అనితాశర్మ, కాజల్ సింగ్, జీవితా చౌరాసియా, అరుణ, పూర్ణిమ, స్థానిక సర్పంచి కొర్సా లక్ష్మి, ఐటీసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి డి.చెంగల్ రావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: