భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) శుక్రవారం నాడు
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో వినాయక చవితి సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురపాలక - ఐటి మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సూచనల మేరకు కొత్తగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ లో భాగంగా వినాయకుని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టడం వలన నీటి కాలుష్యం పెరుగుతుందనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ టీబీజీకేఎస్ లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపు కృష్ణ, సూరిబాబు, సత్యనారాయణ, చారి , నరసింహ, మొయినుద్దీన్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: