మన్యం టీవి,పినపాక:
పిచ్చికుక్క దాడిలో బాలుడు గాయపడిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే గోపాలరావుపేట గ్రామంలో శుక్రవారంనాడు వినాయకచవితి ఉత్సవాలు జరుగుతుండగా అనిపెద్ది సాయి(14) అనే బాలుడు ఇంటివద్ద నుండి వినాయక మండపం వద్దకు వస్తుండగా దారిలో అకస్మాత్తుగా వచ్చిన పిచ్చికుక్క బాలుడిపై దాడిచేసి తీవ్రగాయాలపాలు చేసింది.బాలుడిని హుటాహుటిన పినపాక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రధమచికిత్స అందజేయడం జరిగింది.గోపాలరావుపేట గ్రామంలో పిచ్చికుక్కల స్వైరవిహారం ఎక్కువైందని రోడ్డు వెంబడి నడవాలంటే భయంగా ఉందని,చిన్నారులు పెద్దలు భయబ్రాంతులకు గురవుతున్నారని ఇంతకు ముందుకుడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయని, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని పిచ్చి కుక్కల బారిన పడకుండా చిన్నారులను,తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Post A Comment: