మన్యం టీవీ :ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం నుంచి వంద మంది కార్యకర్తలు బయలుదేరి ఖమ్మంకు వెళ్లారు , ముందుగా గోవింద్ సెంటర్ నుంచి ర్యాలీగా వచ్చి బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ మరియు కొమరం భీమ్ విగ్రహాలకు పూల మాల వేసి వారికి నివాళి అర్పించి అక్కడ నుంచి జెకె కాలనీలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఖమ్మంలో జరిగే కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు టి సత్యనారాయణ ,ఉపాధ్యక్షుడు ఎల్ కాంతారావు , నియోజకవర్గ ఇంచార్జ్ రాయల్ శ్రీను , రాష్ట్ర స్వేరోస్ సర్కిల్ ఉపాధ్యక్షుడు బి ప్రతాప్ కార్యకర్తలు నరేష్ ,కిరణ్ ,రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: