మన్యం టీవి, పినపాక:
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం మాట్లాడుతూ పినపాక మండలం వ్యాప్తంగా రోజురోజుకు విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు పెరుగుతున్న వి ప్రభుత్వ అధికారులు పట్టించుకునే వారు లేరు. సెప్టెంబర్ ఒకటో తారీఖున మండల తాసిల్దార్ కు కాంగ్రెస్ పార్టీ తరఫున మెమోరాండం ఇవ్వడం జరిగింది నాలుగో తారీఖున మండల పరిధిలో ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆరో తారీఖున మణుగూరు పట్నం లో రోడ్డు దిగ్బంధం చేయడం జరిగింది. అఖిలపక్ష పార్టీలు ఎన్ని ధర్నాలు చేసినా ప్రజలను పట్టించుకోక పోవడం వలన ఈ ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తుందా నిద్ర పోతుందా ఈరోజు మండలంలోని సీతంపేట గ్రామం లో రేగళ్ళ సమ్మయ్య కూతురు డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. ఏజెన్సీ ప్రాంతంలో రోజురోజుకు పెరుగుతున్న డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలను పట్టించుకునే అధికారులు లేకపోవడం వలన ఏజెన్సీలో ఆర్ఎంపీ డాక్టర్లు ఆగడాలు హద్దులేకుండా పోతున్నారు. ఈ ప్రభుత్వానికి పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే కు సిగ్గు శరం ఉంటే మణుగూరు పట్టణంలో వంద పడకల దావఖాన లో వెంటనే వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల రైతు కిసాన్ ప్రెసిడెంట్ ఏలూరి వెంకటేశ్వర్ రెడ్డి, మహిళా మండలి అధ్యక్షురాలు నాగమణి, మైనార్టీ సెల్ ఎస్.కె మదర్ సాహెబ్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చందా వరప్రసాద్, పరిష్క రాంబాబు, రామ్ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: