మన్యం టివి;ములకలపల్లి మండలం: విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన రజక వృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్ సత్తెనపల్లి రామకృష్ణ 21 వ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిగొండ రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి రామకృష్ణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటం లో పాల్గొనడం జరిగిందని,ఆ పోరాటంలో బషీర్ బాగ్ పోలీసు కాల్పుల్లో వీర మరణం పొందిన రజిక బిడ్డ రామకృష్ణ పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్ అని,విద్యుత్ రేట్లు పెంపుదలకు ప్రభుత్వం వెనుకబాటు జరగటం జరిగిందని దాని ఫలితమే రైతులకు ఉచిత విద్యుత్ అందింది.అదేవిధంగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం రజకులకు, నాయీ బ్రాహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటిస్తే వాటిని అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి చివరకు ఏప్రిల్ 4వ తారీఖున జీవో నెంబర్ 2 ఇవ్వడం జరిగిందని,కావున రజకులు అందరు ఈ 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును వినియోగించుకొని రజక వృత్తిని అభివృద్ధి పరుచుకోవాలని,ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రజకులకు ఉచిత ఇస్త్రీ పెట్టెలు, వాషింగ్ మిషన్లు,ఇస్త్రీ బల్లలు,ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 53 సంవత్సరాలు నిండిన ప్రతి రజక వృత్తిదారునికి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిగొండ చిన్న రాంబాబు,ధర్మరాజు,సాంబ,శ్రీను, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: