దళిత నాయకులు దీకొండ కాంతారావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ
మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామం లో దళిత నాయకులు దీకొండ కాంతారావు ఆధ్వర్యంలో హైదరాబాద్ సింగరేణి కాలనీ లో గిరిజన బాలిక చైత్ర ను అత్యంత పాశవికంగా హత్య చేసిన దుండగుడిని ఉరితీయాలంటూ కొవ్వొత్తులు వెలిగించి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని అశృనివాళి అర్పించారు. తధాననంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దీకొండ కాంతారావు మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమం లో జాడి జ్యోతి, గోమాసు గంగాభవాని, గోమాసు హేమ, ధీగొండ దుర్గ భవాని, కావిరి అంజలి, గోమాసు ప్రియాంక, కొండగుర్ల శ్రీను, జాడి సురేష్, దీగొండ శ్రీను, గోమాసు వెంకటేశ్వర్లు, పూసల గణేష్, గోమాసు చింటూ, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: