👉బండారు జగదీశ్వర్ రావు మరో రూ.5 వేల ఆర్థిక వితరణ
మన్యం టీవి, పినపాక
భద్రాద్రి కొత్తగూడెంం జిల్లా పినపాక మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన రేగళ్ల సమ్మయ్య కూతురు రేగళ్ళ హారతి (18) అనే ఇంటర్ విద్యార్థిని ఈనెల 7వ తేదీన డెంగ్యూ , కామెర్ల వ్యాధితో మృతి చెందిన విషయం విదితమే . కాగా సోమవారం మైత్రి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ 5000 , సీతం పేట గ్రామానికి చెందిన బండారు జగదీశ్వరరావు రూ 5000 లను మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు . ఈ కార్యక్రమంలో మైత్రి ట్రస్ట్ అధ్యక్షులు సాని కొమ్ము వెంకట్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు బండారు రాంబాబు , సత్తిబాబు, సుబ్రహ్మణ్యం , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: