మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గడ్డంపల్లి గ్రామ పంచాయతీ లో ప్రజా కవి కాళోజి నారాయణ రావు గారి జయంతి వేడుకలు నిర్వాహించడం జరిగింది. తెలంగాణ తొలితరం కవి కాళోజీ నారాయణరావు పుట్టినరోజు తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించిన నేపథ్యంలో ఈ వేడుకలు జరుపుకున్నామని, తనదైన శైలిలో నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన గురించి రచనలు చేసి తెలంగాణ ప్రజలను మేలుకొలిపిన మహాకవి కాళోజీ అని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలివేటి సునీల్ కుమార్, కార్యదర్శి అజహర్ , వార్డ్ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: