CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఎన్నికైన ప్రభాకర్ టీచర్ కి సన్మాన కార్యక్రమం..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లోని అచ్యుతాపురం ఎం పి పి ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు అమర్లపూడి ప్రభాకర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన అభినందన సభ ఏర్పాటు చేసిన కొత్తపల్లి పాఠశాల లో సన్మానం చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షతన పాఠశాల హెడ్మాస్టర్ మడకం మోతిరు  ప్రసంగిస్తూ ప్రభాకర్ గారి సన్మానం ఈ రోజు కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా కార్యక్రమం జరపడం  ఆనందానికి అవధులు లేవని తెలుపుతూ వారు ఎంతో మృదు స్వభావి సర్వీస్ పరంగా ఎంతో మచ్చలేని ఉపాధ్యాయులుగా పేరున్న మహా గొప్ప సంకల్పి అని చెప్పారు.తదనంతరం దుమ్ముగూడెం మండలం విద్యా అధికారి యస్.సమ్మయ్య  మాట్లాడుతూ ప్రభాకర్  దుమ్ముగూడెం మండలానికి ఒక మంచి ఉపాధ్యాయుడిని పరిచయం చేసిందని వారు అన్నారు.తదనంతరం సర్వీసు పరంగా మంచి శ్రమ పడి ఉపాధ్యాయులకు ఎంతో సర్వీసును అందించిన మహా గొప్ప సంకల్పి అని కొనియాడారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ టి డబ్ల్యూ టి యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కారం సర్వేశ్వరరావు దొర ప్రసంగిస్తూ ప్రభాకర్  ఎంతో మృదు స్వభావి సర్వీస్ పరంగా ఎంతో మంది ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూ అన్ని వేళలా ఉపాధ్యాయులకు వెన్నంటే ఉండి దుమ్ముగూడెం మండలం ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎన్నో ఉన్నతమైన కెరీర్ ప్రారంభించిన ఘనుడు ప్రభాకర్ అని కొనియాడారువిద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్యను అందించడం లో దిట్ట అని కొనియాడారు.ఇదిలా ఉండగా వారి సేవలను గుర్తించి ప్రభుత్వం గుర్తించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు ఇవ్వడం మంచిదన్నారు.ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం హైస్కూల్ ఉపాధ్యాయులు సెక్రెటరీ,కాంప్లెక్స్ పరిధి ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు.. కొత్తపల్లి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,ఎస్ వి లక్ష్మణ్ రావు,చేన్నారవు అంజనేయులు,ప్రసాద్,ముత్తయ్య.హరి,శ్రీను,ప్రతాప్ సింగ్ నాయక్,లక్పతి.రాంబాబు,పార్వతి.సరస్వతి ,సుకన్య. తదితరులు పాల్గొన్నారు.. కొత్తపల్లి స్కూల్ లో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

Share it:

Post A Comment: