మన్యం మనుగడ, పినపాక:
మానవత్వం మంటగలిసింది. పేగుబంధం కాదు పొమ్మంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును చెత్తకుండీలో వదిలేసి మాతృత్వాన్ని వదిలేసుకుంది, ఆ మహాతల్లి. ఆ పసికూన అదృష్టం బాగుండి, చెత్త కుండి నుండి దవాఖానకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాచలం బస్టాండ్ కు సమీపంలో ఓ పసి కూన ఏడుపు వినిపించి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ప్రాంతానికి చెందిన ఆదివాసి యువకుడు కొమరం సతీష్ అటుగా వెళుతూ, అక్కడకు వెళ్లి చూడగా ముక్కుపచ్చలారని ఆడకూతురు చెత్తకుండీలో కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ యువకుడు చిన్నారి చిట్టి తల్లిని భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని గురించి వివరించడం జరిగింది. అది గమనించిన ఆసుపత్రి వైద్యులు ఎవరో గుర్తుతెలియని తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని, భావంతో చెత్తకుండీలో వదిలేసి మాతృత్వాన్ని దూరం చేసుకున్నారని తెలియజేయడం జరిగింది. 12 రోజుల క్రితం భద్రాచలంలోని ఆసుపత్రులలో పురుడు పోసుకున్న వారి, వివరాలు సేకరించి దిశగా ప్రయత్నించాలని, అలాంటి మానవత్వం లేని వారికి, తగిన శిక్ష విధించే దిశగా ఆలోచించాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. చెత్తకుండీ నుండి చిట్టి తల్లి ని ఆస్పత్రికి చేర్చిన సతీష్ గురించి ప్రతి ఒక్కరూ, మానవత్వం పరిమళించిన వ్యక్తి అని, ఆదర్శ వ్యక్తి ఈ సతీష్ అని పినపాక మండల ప్రజలు కొనియాడుతున్నారు.
Post A Comment: