మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, తిర్లపురం గ్రామ పంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు తిర్లపురం గ్రామ పంచాయతీ నూతన ఎస్టీ కమిటీని,గ్రామ శాఖ అధ్యక్షులు పెండ్యాల. నాగేశ్వరరావు అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మణుగూరు జడ్పీటీసీ పొశం.నరసింహారావు హాజరైనారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ కమిటీలు,పార్టీ నిర్మాణానికి పునాదులు అని,టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల లోనికి తీసుకొని పోవాలని,రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని,రేగా కాంతారావు ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఎస్టీ కమిటీ అధ్యక్షులుగా ఎలిబోయిన. సతీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకి ని బాబురావు,ఉప సర్పంచ్ కంటెం సురేష్,మైనారిటీ అధ్యక్షులు ఎండి.హబీబ్, యూత్ అధ్యక్షులు సోయం. కృష్ణ,యువజన నాయకులు బర్ల.సురేష్,మీసాల.నరేష్, తాటి.రాంబాబు,మడి.సారయ్య,కూర.మల్లేష్,టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పాయం. రేణుక,కుంజా.స్వరూప,పడిగ.జయమ్మ,ఇమ్మడి.రమణ, బొగ్గం.విజయ కుమారి, ఇమ్మడి.రమణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: