మన్యం టీవీ పాల్వంచ:-
ఇటీవల నూతనంగా గిరిజన సంక్షేమ శాఖ విభాగంలో రాష్ట్ర ట్రైకార్ జనరల్ మేనేజర్ గా పదోన్నతి పొందిన కుంజ శంకర్ రావు ని హైదరాబాద్ డీసీసీ భవన్ లో భద్రాద్రి జిల్లా ఆదివాసీ సేన కమిటీ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన రాష్ట్ర నాయకులు,హైకోర్టు న్యాయవాది సోడే వెంకటేష్ గారు మాట్లాడుతూ ఏజెన్సీ మారుమూల గ్రామంలో జన్మించి,చిన్నప్పటి నుండి కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవడం ఆదివాసీ సమాజానికి గొప్ప శుభ సూచికంగా ఉందని, ఆదివాసీల సంక్షేమం కోసం రాష్ట్ర గిరిజన శాఖలో ట్రైకార్ జనరల్ మేనేజర్ గా ఉన్నత బాధ్యతలు స్వీకరించి నిరంతరం ఎలాంటి ఒడిదుడుగులకు తావులేకుండా పని చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం కష్టపడి చదివి ఉన్నతస్థాయి లో స్థిరపడలన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సేన జిల్లా కన్వీనర్ ఊకె.రవి, నరేష్,వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: