ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్
మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూరునాగారం మండలం చిన్న బోయినపల్లి హెల్త్ వెల్నెస్ సెంటర్ ను సందర్శించి హెల్త్ వెల్నెస్ సెంటర్ పరిధిలో సాధారణ వైద్య సేవలతో పాటు గర్భిణీలకు రెగ్యులర్ చెకప్స్ ను ఫర్ఫెక్ట్ గా నిర్వహించాలని వైద్య సిబ్బంది ఆదేశించిన ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ మరియు అధికారుల బృందం.ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్ మరియు అధికారుల బృందం పరిశీలించారు. ముందుగా తాడ్వాయి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించి మెనూ ప్రకారం చిన్నారులకు,గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని,గర్భిణీలు రెగ్యులర్ గా వైద్యపరీక్షలు చేయించుకునేల చూడాలని, పౌష్టికాహారం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లాలో అంగన్వాడీ సేవలు, అంగన్వాడీ భవనాలకు గల సొంత భవనాలు మరియు అద్దెభవనాల వివరాలను జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య అందించారు.అనంతరం మంగపేట మండలం బ్రాహ్మణ పల్లి లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నిపరిశీలించారు.ఆమెతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,మహిళా & శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ దివ్య రాజన్,ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ క్రిస్టియానా, తెలంగాణ హరితహారం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్,అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, భద్రాచలం ఐటిడిఎ పిఓ గౌతమ్ పోట్రో,జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర్,జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య హెల్త్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: