మన్యం టీవీ మంగపేట.
సోమవారం శ్రీమతి సోనియాగాంధీ,రాహుల్ గాంధీ, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు మంగపేట మండల కేంద్రంలో మరియు కమలాపురంలో ప్రభుత్వరంగ సంస్థలు పాఠశాలలు పెట్రోల్ బంకులు కిరాణా షాపులు బందు చేయించడం జరిగింది .ఈ రోజు భారత్ బందును ఉద్దేశించి ములుగు జిల్లా ఎస్ టి సెల్ అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గత సంవత్సరం ప్రవేశపెట్టిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 4 లేబర్ కోడ్స్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని రైతు వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలని అన్నారు .కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి,ఎస్ టి సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, సీతక్క యువసేన మండల అధ్యక్షుడు సిద్ధ బత్తుల జగదీష్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయ్ తుల్ల, మంగపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్ డి హుస్సేన్ ,కమలాపురం గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు పాడి చలపతిరావు, భూమా సంజీవ, రవి,ముకుంద,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: