మన్యం టీవి, భద్రాచలం:
ద్రాచల వాసి విశ్రాంత ఉద్యాన శాఖ అధికారి మరియు గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు అయిన గోళ్ళ భూపతి రావు కు "హోప్ సేవా సమితి మరియు సింధు ఆర్ట్ అకాడమీ" సూర్యా పేట వారు ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ దైద వెంకన్న పర్యావరణ పరిరక్షణ లో వీరు చూపిన విశేష ప్రతిభ కు గుర్తింపు గా గుర్రం జాషువా 126 వ జయంతి సందర్భంగా " జాతీయ పర్యావరణ మిత్ర "" పురస్కారాన్ని ఈరోజు రవీంద్ర భారతి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిలు గా విచ్చేసిన ప్రముఖ కవి గాయకుడు ఎమ్మెల్సీ శ్రీ గోరేటి వెంకన్న, శ్రీ దైవజ్ఞ శర్మ, కోదాడ ఎమ్మెల్యే శ్రీ బోలం మలయ్య యాదవ్, సూర్య పేట జిల్లా చైర్ పర్సన్ శ్రీ మతి గుజా దీపికా, సినీ హీరో కిరణ్, ఆంధప్రభ ఎడిటర్ శ్రీ శర్మ , మరియు జడ్జి శ్రీ మధుసూదనరావు గారి చేతులు మీదుగా జాతీయ "పర్యావరణ మిత్ర"
పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ ఈ పురస్కారం ద్వారా నా మీద మరింత బాధ్యత పెరిగిందని పర్యావరణ పరిరక్షణకు ఇంకా చురుగ్గా పాల్గొంటానని అదేవిధంగా ఈ నా ప్రయాణంలో నాతో పయనిస్తూన మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
Post A Comment: