సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి. ఆర్.
మార్క్సిస్టు మహోపాధ్యాయ డు మావో అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి అన్నారు. మావో 45 వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా దేశంలో అర్ధ వలస,అర్థ భూస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా పీడిత ప్రజల విముక్తి కోసం, సమ సమాజ స్థాపన కోసం పోరాడి, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అక్కడి నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంధాలో ప్రాణ త్యాగాల తో లాంగ్ మార్చ్ నిర్వహించి చైనా దేశాన్ని విముక్తి చేసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాడు అని కొనియాడారు. కామ్రేడ్ మావో 1976 సెప్టెంబర్ 9 న మరణించారని ఆయన మరణించి నేటికీ 45 సంవత్సరాలు
అవుతుందన్నారు. కామ్రేడ్ మావో చూపించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలో మనమంతా ప్రయాణించాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు ఎండీ. గౌస్, రాజేందర్, రాజు, రామయ్య, రామకృష్ణ, కమలమ్మ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: