మన్యం టీవి, మణుగూరు:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ బిల్లులను రద్దు చేయాలనీ కోరుతూ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం మణుగూరు ఏరియాలోని వివిధ సింగరేణి డిపార్ట్మెంట్ లలో ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా sccwu(ఇఫ్టు అనుబంధం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ గౌస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేసిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులను, రైతులను, ప్రజలను ఆదుకోవాల్సి0ది పోయి కార్మిక, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకువచ్చి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పక్షమని నిరూపించారని విమర్శించారు. ఢిల్లీలో తొమ్మిది నెలలుగా రైతులు చేస్తున్న పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, వెంకటేశ్వర్లు,అమృత రావు, రమేష్,సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: